భూమీ , పైరూ
కలపబడ్డాయి
ఓ శుభ ముహూర్తం లో
యజమానులైన పెద్దలచే.
భూమి
చాల అందం గా తయారై కనిపించేది
తోడుగా పైరు ఉండగా భరోసాతో.
పైరు చాలా శక్తి తో
ఉత్సాహంగా కనిపించేది
భూమి తనపై తీసుకునే శ్రద్ధతో .
పైరు మరణించింది
ఓ రోజు హఠాత్తుగా .
అంతే
బద్దలైంది
భూమి హృదయం,
అందవిహీనమైంది
దాని శరీరం నెర్రెలతొ.
కనీసం
నీరు పెట్టే వారు కూడా లేరు
ఇపుడు దానికి,
పంట లేదని.
జతకట్టబడితే బాగుండు,
ఆ భూమి త్వరగా
తనకు నచ్చిన ఏ పైరుతో అన్నా .
ఒంటరిగా ఉండడం కష్టం కదా !జీవితాంతం.
బాగుంది మీ చిన్ని కవిత....... భూమి కి తోడు పైరు మాత్రమే అని చక్కగా చెప్పారు.... నచ్చింది...ఈ భావన
ReplyDelete